ఏపీలో ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించి తీరుతాం

పరీక్ష‌ల‌పై ప్ర‌తిపక్ష పార్టీల నేత‌లది అన‌వ‌స‌ర రాద్ధాంతం..మంత్రి సురేశ్‌

అమరావతి: ఏపీలో ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను కూడా ర‌ద్దు చేయాల‌ని ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు తీవ్ర ఒత్తిడి తీసుకువ‌స్తున్నారు. దీనిపై విద్యాశాఖ మంత్రి సురేశ్ స్పందించారు. ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించి తీరుతామ‌ని తేల్చిచెప్పారు. ఈ ప‌రీక్ష‌ల తేదీల‌ను కొవిడ్ ఉద్ధృతి త‌గ్గాక ప్రక‌టిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ప‌రీక్ష‌లు ర‌ద్దు చేయాల‌ని విద్యార్థుల త‌ల్లిదండ్రులు కోర‌ట్లేదని చెప్పుకొచ్చారు. పరీక్ష‌ల‌పై ప్ర‌తిపక్ష పార్టీల నేత‌లు అన‌వ‌స‌ర రాద్ధాంతం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు.


ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వాన్ని పురస్కరించుకుని, ఈ రోజు రాజ‌మ‌హేంద్రవ‌రంలో ఎంపీ భ‌ర‌త్‌తో క‌లిసి మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మంలో పాల్గొన్న మంత్రి సురేశ్ ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లడారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/