ఏపీ సీఎం జగన్ కాలికి గాయం

ఏపీ సీఎం జగన్ కాలికి గాయమైంది. దీంతో జగన్ ఒంటి మిట్ట పర్యటనను రద్దు చేసుకున్నారు. ఏప్రిల్ 4న ఉదయం జగన్ ఎక్స్ సైజ్ చేస్తున్న సమయంలో కాలు బెణికింది. సాయంత్రానికి కాలి నొప్పి తీవ్రమవడంతో ప్రయాణాలు రద్దు చేసుకోవాలని డాక్టర్లు సూచించారు. ఈ క్రమంలో ఏప్రిల్ 5న ఒంటి మిట్ట పర్యటనను రద్దు చేసుకున్నారు. గతంలోనూ కాలికి గాయం కావడంతో చాలా రోజులు ఇబ్బంది పడినట్లు డాక్టర్లు తెలిపారు.

షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 5న సీఎం జగన్ ఒంటిమిట్ట కోదండరాముని ఆలయానికి వెళ్లాల్సి ఉంది. ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించాలి. అధికారులు కూడా అందుకు ఏర్పాట్లు చేశారు. కానీ ఇప్పుడు జగన్ కాలికి గాయం కావడం తో పర్యటన రద్దు చేసుకున్నారు.