ఏపి కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి
అమరావతి: ఏపి మంత్రివర్గం ఆమోదం తెలిపిన కీలక నిర్ణయాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు. రైతులకు పగటిపూట ఉచిత విద్యుత్ ఇచ్చే క్రమంలో ప్రభుత్వంపై ఇప్పటివరకు రూ.8,300 కోట్ల పైచిలుకు భారం పడిందని వివరించారు. రాబోయే రోజుల్లో ఇది పెరిగే అవకాశం ఉందని, కొత్త రైతులు వస్తుంటారని, కొత్త కనెక్షన్లు ఇవ్వాల్సి వస్తుందని తెలిపారు. అందుకే ఈ భారం తగ్గించుకునేందుకు సీఎం జగన్ ప్రభుత్వం 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ పార్కు ఏర్పాటు చేస్తోందని వెల్లడించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/