ఏపీ బిజెపి అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదల
ఏపీ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. త్వరలో జరగబోయే అసెంబ్లీ , లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ, జనసేనతో కలిసి బీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతోంది. పొత్తులో భాగంగా బీజేపీకి 6 ఎంపీ సీట్లు, 10 ఎమ్మెల్యే సీట్లలో పోటీ చేయబోతుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను బుధువారం విడుదల చేసింది.
అసెంబ్లీ బరిలో పోటీ చేసే అభ్యర్థులు వీరే..
- ఎచ్చెర్ల – ఈశ్వరరావు
- విశాఖ నార్త్ – విష్ణుకుమార్ రాజు
- అరకు వ్యాలీ – రాజారావు
*అనపర్తి – శివకృష్ణంరాజు - కైకలూరు – కామినేని శ్రీనివాస్
- విజయవాడ వెస్ట్ – సుజనా చౌదరి
- బద్వేల్ – బొజ్జ రోశన్న
- జమ్మలమడుగు – ఆదినారాయణరెడ్డి
- ఆదోని – పార్థసారథి
- ధర్మవరం నుంచి వై.సత్యకుమార్ పోటీ చేయబోతున్నారు.
ఇక బిజెపి లోక్ సభ అభ్యర్థులను చూస్తే..
- అరకు – కొత్తపల్లి గీత
- అనకాపల్లి – సీఎం రమేష్
- రాజంపేట – కిరణ్ కుమార్ రెడ్డి
- నర్సాపురం – భూపతిరాజు శ్రీనివాసవర్మ
- తిరుపతి – వరప్రసాదరావు
- రాజమండ్రి – దగ్గుబాటి పురంధేశ్వరి లు బరిలోకి దిగుతున్నారు.