కీలక నిర్ణయం తీసుకున్న సచిన్ టెండూల్కర్!
తన పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయం
ముంబయి: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహామ్మారిని తరిమి కొట్టేందుకు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి అహర్నిశలు శ్రమిస్తున్న వైద్యులు, నర్సులు, పారిశుద్ద్య కార్మికులు, పోలీసులు, రక్షణ సిబ్బంది కోసం భారత దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఈ శుక్రవారం 47 పడిలోకి అడుగుపెడుతున్న సచిన్, ఈ సంవత్సరం తన జన్మదిన వేడుకలు జరుపుకోకుడదని నిర్ణయించుకున్నాడు. కరోనాపై ముందు వరుసలో నిలబడి పోరాడుతున్న వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పోలీసులు, రక్షణ సిబ్బందికి మద్దతు ఇవ్వడానికి ఇంత కంటే మంచి మార్గ లేదన్నట్లు మాస్టర్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/