తెలంగాణలో మరో కరోనా కేసు
మరో ఇద్దరికి అనుమానిత లక్షణాలు
Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో మరో కరోనా కేసు నమోదైంది. ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో కరోనా వైరస్పై జరిగిన స్వల్పకాలిక చర్చలో వెల్లడించారు. గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు.
మరో ఇద్దరికి కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నాయి. వారి రక్త నమూనాలను పుణ పరీక్ష కేంద్రానికి పంపారు.
తాజా వార్త ఇ-పేపర్ కోసం క్లిక్ చేయండి: https://epaper.vaartha.com