బ్రెజిల్ అధ్యక్షునికి కరోనా నెగటివ్
ఆర్మీ ఆసుపత్రిలో పరీక్షలు
బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సొనారోకు కరోనా వైరస్ నెగటివ్గా వచ్చింది. జైర్కు కరోనా వైరస్ సోకినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.
కాగా ఆర్మీ ఆసుపత్రిలో పరీక్షల అనంతరం జైర్కు కరోనా నెగటివ్గా వచ్చినట్లు వెల్లడైంది. ఈ విషయాన్ని జైర్ బోల్సొనారో తన ఫేస్బుక్లో పోస్టు చేశారు.
” బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సొనారోకు కరోనా వైరస్ పరీక్ష నెగటివ్గా వచ్చినట్లు ఆర్మీ దళాల ఆసుపత్రి (నిర్ధారణ ప్రయోగశాల) సాబిన్ రిపోర్టు ఇచ్చింది” అని బోల్సొనారో తన ఫేస్బుక్లో పోస్టు చేశారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/