వివేకా కేసును సీబీఐకి ఎందుకు అప్పగించడం లేదు?
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కేసును పట్టించుకోవడం లేదు
విజయవాడ: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో జాప్యం ఎందుకు జరుగుతోందని
టిడిపి నేత బుద్దా వెంకన్న ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసును సీబీఐకి ఎందుకు అప్పగించడం లేదన్నారు. వివేకా హత్యలో సీఎం జగన్ పాత్ర కూడా ఉందనేది ప్రజలకు అర్ధమవుతోందన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కేసును పట్టించుకోవడం లేదని వివేకా కుటుంబ సభ్యులే చెబుతున్నారని అన్నారు. మూడు నెలలైనా వివేకా హత్య కేసులో దోషులను పట్టుకోలేకపోయారని, ఇంత జాప్యం జరుగుతుందంటే వైఎస్ భాస్కర్రెడ్డితో పాటు..జగన్ కూడా కుట్రదారేనని బుద్దా వెంకన్న ఆరోపించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/