కరోనా పై పోరుకు ఏపి గవర్నర్ విరాళం
ట్వీట్ చేసిన గవర్నర్ కార్యాలయం
అమరావతి: కరోనాపై పోరాటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ తన వంతుగా సాయాన్ని ప్రకటించారు. పీఎం కేర్స్ ఫండ్కు ఒక నెల వేతనంను, సిఎం రిలీఫ్ ఫండ్కు ఒక లక్ష రూపాయలను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఇవ్వనున్నట్టు గవర్నర్ కార్యాలయం ట్వీట్ చేసింది. కరోనా వ్యాప్తి ని అరికట్టాలంటే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండాలని, ప్రతి ఒక్కరు సామాజిక దూరంను పాటించాలని గవర్నర్ సూచించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/