ఏపిలో భారీగా కరోనా కేసుల నమోదు
గడిచిన 12 గంటలలో 21 కొత్త కేసులు.. 132 చేరిన మొత్తం కేసులు
అమరావతి: ఏపిలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది కేవలం గడిచిన 12 గంటలలో మరో 21 కోత్త కేసులు నమోదు అయ్యాయి. దీనిని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దీంతో ఏపిలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 132 కు చేరింది. ఇందులో మర్కజ్ మత ప్రార్ధనలలో పాల్గోని వచ్చిన వారే అధికంగా ఉండడం గమనార్హం. కాగా అత్యధికంగా గుంటూరులొ 20, నెల్లూరులో 20 కేసులు నమోదు అయ్యాయి. ఆ తరువాత కడప, క్రిష్ణ జిల్లాలో 15 కేసుల చొప్పున నమోదు అయ్యాయి. ఇంకా సుమారు 500 మంది నివేదికలు రావాల్సి ఉంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/