ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్‌ సింగ్‌ అరెస్ట్‌

35 రోజులపాటూ పోలీసుల్ని ముప్పుతిప్పలు పెట్టిన అమృత్‌పాల్.. ఎట్టకేలకు లొంగిపోయాడు. అతను అరెస్ట్ అవ్వడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. పంజాబ్.. మోగాలో పోలీసులకు అతను లొంగిపోయాడు. నిజానికి అతన్ని మార్చి 18న అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ విషయం తెలియడంతో అతను తప్పించుకున్నాడు. ఆ తర్వాత అతని కోసం 80 వేల మంది పోలీసులు వేట సాగించారు.

తన స్వగ్రామానికి శనివారం రాత్రి చేరుకున్న అమృత్‌పాల్ సింగ్.. ఈ ఉదయం అక్కడ స్థానికులు కొందరితో మాట్లాడాడు. అమృతపాల్ సింగ్ గత రాత్రి తన గ్రామమైన జల్లుపూర్ ఖేరా చేరుకుని ఉదయం ప్రార్థనలు చేసినట్లు తెలిసింది. అతడి గురించి సమాచారం అందడంతో పోలీసులు గ్రామాన్ని చుట్టుముట్టారు. దీంతో తప్పించుకునే మార్గం లేక పోలీసులకు లొంగిపోయాడు.