మునుగోడు కు చేరుకున్న అమిత్ షా..

కేంద్రమంత్రి అమిత్ షా మునుగోడుకు చేరుకున్నారు. ఈరోజు మునుగోడు లో బిజెపి సమరభేరి పేరిట సభ ఏర్పటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సభ లోనే మాజీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపి కండువా కప్పుకోబోతున్నారు. ఈ సందర్బంగా అమిత్ షా ఈ సభ కు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఉదయం ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో బేగంపేట కు చేరుకున్న అమిత్ షా..సికింద్రాబాద్ లోని మహాకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.

అనంతరం సాంబమూర్తి నగర్ కాలనీలోని కళాసిగూడలో ఉన్న బీజేపీ కార్యకర్త సత్యనారాయణ ఇంటికి వెళ్లి..వేడివేడి కాఫీని తాగారు. కాఫీ తాగుతూ.. సత్యనారాయణ బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత మునుగోడు కు బయలుదేరిన అయన..కొద్దీ సేపటి క్రితం సభ స్థలానికి చేరుకున్నారు. సభ వేదిక ఫై పార్టీ కండువా కప్పి రాజగోపాల్ రెడ్డి ని పార్టీలోకి ఆహ్వానించారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో బహిరంగ సభలు, పాదయాత్రలో మనుగోడులో రాజకీయ సందడి నెలకొంది. ఇప్పటికే మునుగోడులో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి పాదయాత్ర చేయగా.. సీఎం కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ మునుగోడు ప్రజాదీవెన పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈరోజు బిజెపి సభ జరుగుతుంది. మరి ఈ సభ లో అమిత్ షా ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో చూడాలి.