ఒరేయ్ పిరికిపందల్లారా అంటూ బాబు , పవన్ లపై అంబటి సెటైర్లు

ambati rambabu satir to pawan chandrababu

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , టీడీపీ అధినేత చంద్రబాబు కలయికపై వైస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో మంగళవారం (అక్టోబర్ 18) మధ్యాహ్నం పవన్ – బాబు దాదాపు గంటన్నర పాటు భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇటీవల జరిగిన పరిణామాలు చూసి పవన్ కళ్యాణ్ కు సంఘీభావం తెలిపేందుకే కలిశానని చంద్రబాబు అన్నారు.

పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టుకున్నరోజే ప్రభుత్వ కార్యక్రమం పెట్టడం సరికాదని చంద్రబాబు అన్నారు. పవన్ కళ్యాణ్ విశాఖ వదిలి వెళ్లేవరకు ఆంక్షలు పెట్టారని , పవన్ వెళ్లే దారిలో లైట్లు కూడా తొలగించడం దారుణమన్నారు. ఒకేరోజు ఎప్పుడు రెండు పార్టీల సమావేశాలు జరగలేదన్నారు. రెండు పార్టీల నేతలు ఎదురుకాకుండా పోలీసులు చూసుకుంటారని తెలిపారు. కానీ విశాఖలో పోలీసుల తీరు ఇందుకు విరుద్ధంగా వ్యవహరించారని మండిపడ్డారు. ప్రతిపక్షాలపై దాడులు చేసి తిరిగి తమపైనే కేసులు పెడతారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. దాడులు చేయడం.. కేసులు పెట్టడం, జైలులో వేయడం దారుణమన్నారు. ప్రతిపక్షాలపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎదురుతిరిగితే కేసులు, దాడులతో భయపెడుతున్నారని పేర్కొన్నారు. ఏపీలో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతోందన్నారు. కొందరు పోలీసులు దారుణంగా ప్రవర్తిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటె వీరి ఇరువురు కలయిక ఫై మంత్రి అంబటి ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. “జనసైనికులా? బాబు బానిసలా? యుద్ధానికి సిద్ధమన్నావు, చంద్రబాబు సంకెక్కావు, పిరికోళ్లందరూ కలిసే రండి చూసుకుందాం!” అంటూ వరుస ట్వీట్ లు చేశారు. టిడిపి, జనసేనలు రాబోయే ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంటున్నాయనే అర్థంతో అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.మా ఎమ్మెల్యేలను కాదు.. కనీసం మా కార్యకర్తలను టచ్ చేసి చూడు ఏమి జరుగుతుందో? అంటూ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో రౌడీయిజానికి పవన్ కళ్యాణ్ నాంది పలుకుతున్నాడని ఆరోపించారు. నియోజకవర్గాలలో తిరిగి చూడు ఏమి జరుగుతుందో? అని హెచ్చరించారు.