ఒక్క టికెట్ తో ఇద్దరు సినిమా చూసే ఛాన్స్ కల్పించిన నిర్మాత అల్లు అరవింద్

ఓటిటి దెబ్బకు ప్రేక్షకులు సినిమా థియేటర్స్ కు వెళ్లడమే తగ్గించారు. సినిమాకు హిట్ టాక్ వచ్చి , అది కూడా పెద్ద హీరో అయితే తప్ప థియేటర్ కు వెళ్లి సినిమా చూడడంలేదు. ఒకవేళ వెళ్లిన ఫ్యామిలీ తో కాకుండా సింగిల్ గా వెళ్లి వస్తున్నారు. దీనికి కారణం సినిమా విడుదలైన నెల రోజుల లోపే ఓటిటి లోకి రావడమే. వందలకు వందలు ఖర్చు పెట్టి సినిమా చూసే బదులు..ఏచక్క ఇంట్లో ఓటిటి లో సినిమా చూస్తే బెటర్ అని డిసైడ్ అవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా నిర్మాత అల్లు అరవింద్ చక్కటి అవకాశాన్ని సినీ లవర్స్ కు అందజేశారు. ఒక్క టికెట్ తో ఇద్దరు సినిమా చూసే ఛాన్స్ కల్పిస్తున్నారు.

కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘వినరో భాగ్యము విష్ణు కథ’ మూవీ.. శివరాత్రి కానుకగా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. టాక్ బాగున్నప్పటికీ సినీ జనాలు పెద్దగా సినిమా చూసేందుకు ఇష్టపడడం లేదు. ఈ క్రమంలో ప్రేక్షకులకు ఈ చిత్ర బృందం ఓ సదావకాశాన్ని అందిస్తోంది. ఒక్క టికెట్ పై ఇద్దరు సినిమా చూసే అవకాశాన్ని కల్పిస్తోంది. అదీ కూడా బుధ, గురు వారాల్లో మాత్రమే. ఈ అవకాశాన్ని సద్వినియోగపర్చుకోవాలని వెల్లడించింది. ఈ ఆఫర్ కేవలం రెండు రోజులు మాత్రమే వర్తించనుంది. ఈ సినిమాకు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పించగా.. జీఏ 2 పిక్చర్స్ పతాకంపై ‘బన్నీ’ వాస్ నిర్మించారు. ఇందులో కశ్మీరా పరదేశి కథానాయికగా నటించారు. మురళీ శర్మ కీలక పాత్ర పోషించారు.