మరికాసేపట్లో వాలంటీర్లకు వందనం కార్యక్రమం ప్రారంభం

మరికాసేపట్లో గుంటూరు (D) ఫిరంగిపురంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారభించబోతున్నారు. పనితీరు ఆధారంగా 3 కేటగిరీల్లో అవార్డులు ప్రదానం చేయనున్నారు. కనీసం ఏడాది నిరాటంకంగా పనిచేసిన వాలంటీర్ అర్హులని ప్రభుత్వం పేర్కొంది. సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర పురస్కారాలతో పాటు రూ.45 వేలు ఇవ్వనుంది. మండలానికి ఐదుగురు/ మున్సిపాలిటీలో 10 మందికి సేవారత్న కింద రూ . 30వేలు, నియోజకవర్గంలో ఐదుగురికి సేవా వజ్ర కింద రూ. 45వేలు, సేవా మిత్ర కింద మిగతా వారికి రూ.15వేలు ఇస్తారు. అటు లబ్ధిదారుల ఉత్తమ వీడియోలు రూపొందించిన వాలంటీర్లకు రూ.15వేల నుంచి రూ. 25వేల ప్రత్యేక నగదు ఇస్తారు.

ఏపీలో అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్.. ఏపీలో వాలంటరీ వ్యవస్థను తీసుకువచ్చారు. పౌరసేవలను ప్రజల ఇళ్లవద్దకే చేర్చాలనే ఉద్దేశంతో సచివాలయాలు, వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ప్రతి యాభై ఇళ్లకు ఓ వాలంటీర్‌ను నియమించారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాల లబ్ధిని ఈ వాలంటీర్లు అర్హులకు చేరవేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ప్రజలకు వాలంటీర్లు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా వాలంటీర్లకు వందనం పేరుతో వారిని ప్రభుత్వం సత్కరిస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని వాలంటీర్లకు సేవామిత్ర, సేవా రత్న, సేవా వజ్ర పేరుతో అవార్డులు, నగదు పురస్కారం అందిస్తోంది.