భారత్ బాటలోనే ఆస్ట్రేలియా
టిక్టాక్ను నిషేధించాలంటూ ఆందోళన
సిడ్నీ: టిక్టాక్ యాప్ను భారత్ నిషేధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ బాటలోనే ఆస్ట్రేలియన్లు కూడా పయనిస్తున్నారు. టిక్టాక్తో డేటా చౌర్యం ముప్పుందంటూ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సాక్షాత్తూ ఆస్ట్రేలియా శాసనసభ్యులు టిక్టాక్ను నిషేధించాలని ప్రతిపాదిస్తున్నారు. ఇటీవల, లిబరల్ సెనేటర్ జిమ్ మోలన్ మాట్లాడుతూ, టిక్టాక్ను చైనా ప్రభుత్వం వాడుకుంటున్నదని, దుర్వినియోగం చేస్తున్నదని ఆరోపించాడు. విదేశీ జోక్యంపై సోషల్ మీడియాద్వారా సెలెక్ట్ కమిటీని ఎదుర్కోవాలని టిక్టాక్ ప్రతినిధులను లేబర్ సెనేటర్ జెన్నీ మెక్అలిస్టర్ డిమాండ్ చేసినట్లు సమాచారం. టిక్టాక్పై వస్తున్న ఆరోపణలను దాని యజమాని బైట్డాన్స్ ఖండిస్తూనే ఉన్నారు. టిక్టాక్ డేటా అంతా యూఎస్, సింగపూర్లోని సర్వర్లలో స్టోర్ అవుతుందని అతడు చెబుతున్నాడు. అయితే, చైనా ప్రభుత్వానికి డేటాను పొందడం చాలా కష్టమైన పనేంకాదని సౌత్ చైనా ఓ కథనంలో అభిప్రాయపడింది.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business