మధ్యప్రదేశ్ లో కల్తీ మద్యం కాటుకు 11 మంది మృతి
కొందరి పరిస్థితి ఆందోళనకరం ..
Bhopal: కల్తీ కల్లు కాటుకు మధ్య ప్రదేశ్ లో 11 మంది మరణించారు. పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మోరేనా జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో మరణించిన వారు, అస్వస్థతకు గురైన వారు అందరూ కూడా చహ్రా మాన్ పూర్, పెహ్ వాలీ ప్రాంతాలకు చెందిన వారే. వెంటనే మోరేనా జిల్లాలో కల్లు దుకాణాలను మూసి వేయించిన అదికారులు, అస్వస్థతకు గురైన వారిని ఆసుపత్రులకు తరలించారు. వారిలో కొందరి పరిస్థితి ఆందోళన కరంగా ఉందని చెబుతున్నారు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/