ఆదిపురుష్ అప్డేట్ వెర్షన్ టీజర్..
ప్రభాస్ – కృతి సనన్ జంటగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రనౌత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ ఆదిపురుష్. సాహో, రాధేశ్యామ్ సినిమాల తర్వాత రాబోతున్న ఈ మూవీ ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. కాగా ఈ చిత్రం నుండి అప్డేట్ వెర్షన్ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు. మొదట ఈ టీజర్ ను రిలీజ్ చేసినప్పుడు అనేక విమర్శలు వచ్చాయి. అంతే కాదు సినిమా ఫై ఉన్న అంచనాలన్నీ తారుమారు చేసింది. దీంతో మేకర్స్ తమ తప్పులు తెలుసుకొని అప్డేట్ వెర్షన్ టీజర్ ను ఈరోజు రిలీజ్ చేసారు.
తాజాగా రిలీజైన అప్డేట్ వెర్షన్ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. వీఎఫ్ఎక్స్ వర్క్ కాస్త నేచురల్గా అనిపిస్తున్నాయి. కలర్ గ్రేడింగ్లో కూడా చాలా వరకు మార్పులు చేసినట్లు కనిపిస్తుంది. ప్రభాస్ ఫ్యాన్స్కు టీజర్ తెగ నచ్చేసింది. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ లంకాధిపతి రావణాసురుడుగా కనిపిస్తుండగా రాముడి గా ప్రభాస్ , సీతగా కృతి కనిపించనున్నారు. టీ-సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు అత్యంత భారీ బడ్జెట్తో దాదాపు రూ.500 కోట్లతో ఈ సినిమాను నిర్మించాయి. ఇక ఈ సినిమాను జూన్ 16న పాన్ ఇండియా లెవల్లో గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.