వాగును సైతం లెక్కచేయని ఆదిలాబాద్​ కలెక్టర్..ఇలాంటివారే కావాలి

ప్రభుత్వ ఉద్యోగులు ఎలా ఉంటారో తెలియంది కాదు..కొంతమంది ప్రజల కష్టాలను తెలుసుకొని వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తే..మరికొందరు మాత్రం మనకు ఎందుకులే..వారి చావు వారు చస్తారని అనుకుంటారు. అయితే ఆదిలాబాద్​ కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాత్రం అందరిలా కాదని నిరూపించుకుంది. సరైన సమయంలో వైద్యం అందక మృతి చెందిన మహిళా కుటుంబాన్ని పరామర్శించేందుకు ఉప్పొంగే వాగును సైతం లెక్క చేయకుండా కాలినడకన వాగు దాటి మహిళా కుటుంబ సభ్యులను పరామర్శించింది.

వివరాల్లోకి వెళ్తే ..

పర్సువాడకు చెందిన గర్భిణీ సరైన సమయానికి వైద్యం అందక రెండు రోజుల క్రితం మరణించింది. ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వరీబాయి, ఐటీడీఏ అధికారులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. సకాలంలో వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యం చూపిన బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే ఆ గ్రామానికి రోడ్డు మార్గం లేకపోవడం తో కలెక్టర్ తన తోటి అధికారులతో కలిసి కాలి నడకన వాగు దాటి పరామర్శించడం పట్ల అంత హర్షం వ్యక్తం చేస్తున్నారు.