గుడిసెలలోకి దూసుకెళ్లిన ట్రక్కు..8 మంది మృతి

గుజరాత్ : గుజరాత్ లోని​ అమ్రేలి ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఉన్న గుడిసెలోకి ఓ ట్రక్కు దూసికెళ్లింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. ఈ రోజు  తెల్లవారుజామున 2.30 ప్రాంతంలో బధడా గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ట్రక్కుపై డ్రైవర్​ నియంత్రణ కోల్పోయి.. 10 మంది నిద్రిస్తున్న రోడ్డు పక్కనే ఉన్న గుడిసెలోకి దూసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/