స్కిల్ డెవలప్ మెంట్ కేసు.. చంద్రబాబు రిమాండ్ పొడిగింపు
ఈ నెల 19 వరకు రిమాండ్ ను పొడిగించిన కోర్టు
అమరావతిః టిడిపి అధినేత చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టులో నిరాశ ఎదురయింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆయన రిమాండ్ ను ఈ నెల 19 వరకు కోర్టు పొడిగించింది. మరోవైపు చంద్రబాబు బెయిల్ పిటిషన్, సీఐడీ కస్టడీ పొడిగింపు పిటిషన్లపై విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. విచారణ సందర్భంగా ఇరు వైపుల న్యాయవాదుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇవాల్టితో చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ ముగిసింది. రిమాండ్ పొడిగింపు నేపథ్యంలో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉండనున్నారు. ఆయనకు బెయిల్ వస్తుందా? లేదా? అనే విషయం రేపు తేలనుంది.