మరో ఘనత సాధించిన రామ్ చరణ్.. ఆస్కార్‌ యాక్టర్స్‌ బ్రాంచ్‌లో సభ్యత్వం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో అరుదైన ఘటన సాధించారు. ఆస్కార్‌ యాక్టర్స్‌ బ్రాంచ్‌లో సభ్యత్వం పొంది వార్తల్లో నిలిచారు. చిరుత సినిమాతో ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన చరణ్..ఆ తర్వాత మగధీర తో తెలుగు సినిమా రికార్డ్స్ ను తిరగరాశారు..ఈ తరువాత ఎన్ని హిట్ , ప్లాప్ లతో తన స్టార్డం పెంచుకుంటూ వచ్చిన చరణ్ ..రంగస్థలం , ఆర్ఆర్ఆర్ తో ఎన్నో అవార్డ్స్ అందుకున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ చరణ్ ను ఏకంగా గ్లోబల్ స్టార్ ను చేసింది.

ఈ సినిమాలో రామరాజు పాత్రలో అద్భుతంగా నటించినందుకు గాను ఆయనకు ఆస్కార్‌ యాక్టర్స్‌ బ్రాంచ్‌లోనూ సభ్యత్వం దక్కింది. అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ అండ్‌ ఆర్ట్స్‌ ఇటీవల యాక్టర్స్‌ బ్రాంచ్‌లోకి కొంతమంది కొత్త సభ్యులను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరికొంతమంది ప్రతిభావంతులైన నటీనటులకు దీనిలో చోటు కల్పించింది. ‘ఎంతో అంకిత భావంతో ఈ నటులు ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించారు. ఎన్నో సినిమాల్లో వారి నటనతో పాత్రలకు ప్రాణంపోశారు. వారి కళతో సాధారణ సినిమాతో కూడా ప్రేక్షకులకు అసాధారణ అనుభవాలను అందిస్తున్నారు. భావోద్వేగాలను పంచుతూ ప్రశంసలు అందుకుంటున్నారు’ అని అకాడమీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టింది. కొత్తగా ఎంపిక చేసిన వారి పేర్లను వెల్లడించింది. ఇక ఈ లిస్ట్‌లో రామ్ చరణ్‌తో పాటు మరికొందరు హాలీవుడ్ నటులు కూడా ఉన్నారు. దీంతో సినీ ప్రముఖులు, అభిమానులు రామ్‌చరణ్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ బ్రాంచ్‌లోకి ఇప్పటికే ఎన్టీఆర్ చేరిపోయిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం చరణ్..శంకర్ డైరెక్షన్లో గేమ్ చెంజర్ మూవీ చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా మూవీ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.