పంజాబ్ లో ‘ఆప్’కు స్పష్టమైన మెజార్టీ
రెండో స్థానంలో కాంగ్రెస్
పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ లెక్కింపులో ఆప్ స్పష్టమైన మెజార్టీ దిశగా అడుగులు వేస్తోంది. ఫలితాలు ఇంకా వెలువడాల్సిన ఉండగానే ఆప్ ఇప్పటికే మేజిక్ ఫిగర్ ను దాటడడంతో పంజాబ్ పీఠం ఆప్ కైవసం చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ 53 స్థానాల్లో దూసుకుపోతుండగా, కాంగ్రెస్ ద్వితీయ స్తానం లో ఉంది శిరోమణి అకాళీదళ్ కూటమి 8 స్థానాలు, బీజేపీ కేవలం మూడు చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఇక్కడ ప్రస్తుత ముఖ్యమంత్రి చన్నీ పోటీ చేసిన రెండు చోట్లా ముందంజలో కొనసాగుతున్నారు. మాజీ సీఎం, కాంగ్రెస్ అభ్యర్థి పటియాలా నుంచి పోటీ చేసిన అమరీందర్ సింగ్ కూడా ముందంజలో ఉన్నారు. ఇదిలా ఉండగా, సిద్దు వెనుకంజలో ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం : https://www.vaartha.com/andhra-pradesh/