మద్యానికి బానిసై ఫ్లైఓవర్ పై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య

మద్యానికి బానిసై ఓ వ్యక్తి ఫ్లైఓవర్ పై నుంచి దూకిన ఘటన బాలానగర్​ఫ్లై ఓవర్ వద్ద చోటుచేసుకుంది. ఎస్ఆర్​నగర్​లోని బాపునగర్​కు చెందిన భూక్యా అశోక్​(36) మొదటి భార్య అనారోగ్యంతో చనిపోయింది. కొంతకాలం తర్వాత రుక్సానాబేగం అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వెల్డింగ్ పనిచేసే అశోక్ మద్యానికి బానిసయ్యాడు. రోజు తాగొచ్చి భార్యను వేధించేవాడు. చనిపోతానని బెదిరించేవాడు.

సోమవారం ఉదయం 6 గంటలకే మద్యం తాగి వచ్చి భార్య రుక్సానా బేగంను కొట్టాడు. ఈ తర్వాత చనిపోతానని చెప్పి మద్యం మత్తులో ఇంట్లో నుంచి బయటికి వెళ్లాడు. మధ్యాహ్నం 1.30 గంటలకు బాలానగర్​ఫ్లై ఓవర్ పైనుంచి కిందకు దూకాడు. తీవ్రంగా గాయపడ్డ అశోక్​ను గాంధీకి తరలించారు. అప్పటికే అతడు చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటన ఫై పోలీసులు కేసు నమోదు చేసారు.