మళ్లీ మణిపూర్‌లోచెలరేగిన హింస.. 9 మంది మృతి

నెల రోజులుగా మణిపూర్‌లో ఘర్షణలు

9-killed-in-fresh-violence-in-manipur

ఇంఫాల్‌ః జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది. తాజా ఘటనలో మరో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది గాయపడ్డారు. ఖమెన్‌లోక్ ప్రాంతంలో గత రాత్రి జరిగిన కాల్పుల్లో వీరంతా మరణించినట్టు ఆర్మీ వర్గాలు తెలిపాయి. వీరిలో ఓ మహిళ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. గాయపడిన వారిని రాజధాని ఇంఫాల్‌లోని ఆసుపత్రికి తరలించారు.

మరణించిన వారిలో కొందరి శరీరాలపై కోసిన గాయాలు ఉండగా, మరికొందరి శరీరంలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. కర్ఫ్యూ సడలింపు తర్వాత ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. నెల రోజులుగా జరుగుతున్న హింసాత్మక ఘటనలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం చర్యలు తీసుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో కేంద్రరాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాలపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి.