బాలీవుడ్ లో గాడ్ ఫాదర్ కు 600 స్క్రీన్లు పెంపు
చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రానికి హిందీలో భారీగా స్క్రీన్స్ పెంచారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీ దసరా సందర్బంగా గ్రాండ్ గా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయగా.. RB చౌదరి, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. సత్యదేవ్, లేడీ సూపర్ స్టార్ నయనతార, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్రలను పోషించగా , థమన్ మ్యూజిక్ అందించారు. తెలుగు తో పాటు హిందీ లో విడుదలైన ఈచిత్రం నార్త్ ఆడియన్స్ ను సైతం బాగా ఆకట్టుకుంది. దీంతో అక్కడ స్క్రీన్స్ ను పెంచారు.
బాలీవుడ్లో సైతం ఈ చిత్రానికి తొలి మూడు రోజుల్లో మంచి స్పందన వచ్చింది. ప్రేక్షకుల స్పందన నేపథ్యంలో హిందీలో గాడ్ ఫాదర్ కి ఒక్కసారిగా 600 స్క్రీన్లు పెంచారు. ఈ విషయాన్ని చిరంజీవి వెల్లడించారు. తన చిత్రానికి ఇంత మంచి విజయం కట్టబెట్టిన ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ చెబుతూ ఓ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు.
మలయాళంలో మోహన్ లాల్ చేసిన ‘లూసిఫర్’ సినిమాకి ఇది అఫీషియల్ రీమేక్. తెలుగు నేటివిటీకి తగినట్టుగా మోహన్ రాజా మార్పులు చేసి ‘గాడ్ ఫాదర్’ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. చిరంజీవి చెల్లెలి పాత్రలో నయనతార, ప్రతినాయక పాత్రలో సత్యదేవ్ ఆకట్టుకున్నారు. బాలీవుడ్ బడా హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్ర పోషించారు.