ప్రజలు బాగా ఆలోచించి అభివృద్ధి చేసే పార్టీకే పట్టం కట్టాలిః జగదీష్ రెడ్డి

jagadeesh reddy
jagadeesh reddy

హైదరాబాద్ః 20వేల కోట్ల కాంట్రాక్టు పొందిన అని బహిరంగంగా చెప్పిన రాజగోపాల్ రెడ్డి పెద్ద దొంగ అని జగదీష్ రెడ్డి అన్నారు. ఈ విషయంపై ఈసీకి కూడా కంప్లైంట్ చేస్తామన్నారు. దిగజారుడు రాజకీయాలు చేసి..త్యాగం చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ మాట్లాడే ప్రతి అక్షరం అబద్ధమేనని విమర్శించారు. తెలంగాణ ప్రగతిని చూసి ఓర్వలేక బిజెపి దుర్బుద్ధితో ఉపఎన్నికను తీసుకొచ్చిందని జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలు బాగా ఆలోచించి అభివృద్ధి చేసే పార్టీకే పట్టం కట్టాలని కోరారు.

బిజెపికి ఓటేస్తే మోటార్లకు మీటర్లు వస్తాయని..అన్ని రేట్లు పెరుగుతాయని చెప్పారు. టిఆర్ఎస్ ను గెలిపిస్తే పెండింగ్ పనులు అన్నీ పూర్తి చేస్తామని..అభివృద్ధి పనులు కొనసాగుతాయని వివరించారు. అందుకే ఆయనకి పోటీ చేసే హక్కు లేదు. ప్రజలు నిలదీసే పరిస్థితి వచ్చింది. గట్టిగా ఆడిగేందుకు జనం సిద్ధంగా ఉన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/