దేశంలో 562 కరోనా పాజిటివ్ కేసులు
వెల్లడించిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ

దిల్లీ: దేశంలో కరోనా విస్తుృతి ఆగడంలేదు. ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ వైరస్ విస్తరింస్తూనే ఉంది. ఇప్పటివరకు దేశం మొత్తంలో 562 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో 50 మంది ఇప్పటివరకు కరోనా నుండి కోలుకున్నారని, మిగిలిన 512 మంది భాధితులకు ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/