జార్ఖండ్‌లో ఎన్‌కౌంట‌ర్‌.. అయిదుగురు మవోయిస్టులు మృతి

5 Maoists Killed In Encounter In Jharkhand’s Chatra: Police

ఛాత్రా: జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. ఈ ఎదురుకాల్పుల్లో అయిదుగురు న‌క్స‌ల్స్ మృతిచెందారు. ఛాత్రాలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఇద్ద‌రు న‌క్స‌ల్స్‌పై రూ.25 ల‌క్ష‌ల రివార్డు ఉన్న‌ట్లు తెలుస్తోంది. మ‌రో ఇద్ద‌రు న‌క్స‌ల్స్‌పై 5 ల‌క్ష‌ల రివార్డు ఉన్నట్లు జార్ఖండ్ పోలీసులు తెలిపారు. ఆ న‌క్స‌లైట్ల నుంచి ఏకే 47 తుపాకుల‌ను స్వాధీనం చేసుకున్నారు. చ‌త్తీస్‌ఘ‌డ్‌లోని కంకేర్ జిల్లాలో ఆదివారం ముగ్గురు న‌క్స‌లైట్ల‌ను పోలీసులు ప‌ట్టుకున్నారు. ఆ జాబితాలో సుమ‌న్ సింగ్ అంచ‌ల‌, సంజ‌య్ కుమార్ ఉసెండి, ప‌రుశ‌రాం ధ‌నుగ‌ల్ ఉన్నారు. ఈ ముగ్గురిపై చాలా కేసులు ఉన్న‌ట్లు అద‌న‌పు ఎస్పీ కోమ‌న్ సిన్హా తెలిపారు.