ఢిల్లీలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్

pawan-kalyan

అమరావతిః జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. గత రాత్రి ఉదయ్ పూర్ నుంచి పవన్ నేరుగా ఢిల్లీకి చేరుకున్నారు. ఈరోజు కేంద్ర మంత్రి అమిత్ షా.. బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పవన్ కు అమిత్ షా అపాయింట్మెంట్ ఖారారు అయినట్లుగా సమాచారం.

ఏపీ రాజకీయ అంశాలతో పాటు, తెలంగాణకు సంబంధించిన పరిస్థితులపై కూడా బిజెపి పెద్దలతో పవన్ కళ్యాణ్ చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన తరువాత పవన్ హస్తిన టూర్ ఆసక్తిని సంతరించుకుంది. ప్రతిపక్షాలపై వైఎస్‌ఆర్‌సిపి దాడులను కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని పవన్ ఇప్పటికే ప్రకటించారు. పవన్ వెంట నాదెండ్ల మనోహర్ కూడా ఢిల్లీ్కి వెళ్లారు.