గ‌ద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం : ముగ్గురు మృతి

Road Accident
Road accident

జోగులాంబ గ‌ద్వాల : జోగులాంబ గ‌ద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ధ‌రూర్ మండ‌లం వ‌ద్ద వేగంగా వ‌చ్చిన బొలెరో వాహ‌నం.. ఆటోను ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఆటోలో ప్ర‌యాణిస్తున్న ముగ్గురు వ్య‌క్తులు మృతి చెందారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ట‌నాస్థ‌లానికి చేరుకుని, మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతుల‌ను ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతుల‌ను గద్వాల మున్సిపాలిటీ ప‌రిధిలోని దౌద‌ర్‌ప‌ల్లి వాసులుగా గుర్తించారు పోలీసులు. మృతుల నివాసాల్లో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.