కుర్మీల బంద్ నేపథ్యంలో మూడు రాష్ట్రాల్లో 20 రైళ్ల రద్దు..
తమకు ఎస్టీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ కుర్మీ కులస్థులు బుధవారం బందుకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో రైల్వేముందుజాగ్రత్త చర్యగా పశ్చిమబెంగాల్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో 20 రైళ్ల రాకపోకలను రద్దు చేసింది. సౌత్ ఈస్ట్రన్, ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో మరో 47 రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. తమకు షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) హోదాను కల్పించాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశాలో కుర్మీ తెగకు చెందిన ప్రజలు రైల్వే ట్రాక్లపై బైఠాయించారు.
తమకు షెడ్యూల్డ్ తెగ (ST) హోదా కల్పించాలని, కుర్మలి భాషను రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ పలు కుర్మీ సంఘాలు సెప్టెంబర్ 20వతేదీ నుంచి జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశాలోని తొమ్మిది రైల్వే స్టేషన్లలో నిరవధిక రైల్వే దిగ్బంధనానికి పిలుపునిచ్చాయి. దీంతో మూడు రాష్ట్రాల్లో రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ధన్బాద్ రైలు డివిజన్లో గోమోహ్, రాంచీ రైలు డివిజన్లో మురి, అద్రా రైలు డివిజన్లో నిమ్డిహ్, చక్రధర్పూర్ రైలు డివిజన్లో ఘఘరా రైల్వేస్టేషన్లలో కుర్మీ కార్యకర్తలు రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు.