బండ్లగూడ కార్పొరేషన్ పరిధిలో కారు బీభత్సం

బండ్లగూడ కార్పొరేషన్ పరిధిలో కారు బీభత్సం సృష్టించింది. మంగళవారం ఉదయం వేగంగా వచ్చిన గుర్తు తెలియని కారు అదుపు తప్పి వాకింగ్ చేస్తున్న మహిళలపైకి దూసుకెళ్లింది. కారు వేగానికి పుట్ పాత్ పై వాకింగ్ చేస్తున్న అనురాధ, మమతతో పాటు అనురాధ కూతురు కవిత కారుతో సహా చెట్ల పొదల్లోకి దూసుకెళ్లిపోయారు. అనురాధ, మమత అక్కడికక్కడే మరణించగా.. కవితకు తీవ్ర గాయాలయ్యాయి. కవితను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

అయితే ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కారులో ప్రమాదం సమయంలో ఒకరు ఉన్నట్లు తెలుస్తోంది. కారు ఎవరిది, ఎక్కడి నుంచి వస్తుంది, కారు డ్రైవ్ చేసే వ్యక్తి మద్యం సేవించాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఉదయం 6.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెప్పారు.