హైదరాబాద్ లో దారుణం : పెళ్లికి ఒప్పుకోలేదని.. కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి యువతి ఆత్మహత్య

హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జి ఫై నుండి దూకి మరో యువతీ ఆత్మహత్య చేసుకుంది. కర్ణాటక గుల్బర్గా చించోలిలోని సాధిపూరకు చెందిన పాయల్ (17) ఆరు నెలల క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చి మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో హౌస్ కీపింగ్ పని చేస్తుంది. తాను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్పగా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో పాయల్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుండి దూకింది.

దుర్గం చెరువుకు తన ఫ్రెండ్‌తో యువతి వచ్చి కేబుల్ బ్రిడ్జి‌పై నుంచి సెల్ఫీ తీసుకుంటూ ఒక్కసారిగా దూకేసింది. మధ్యాహ్నం 12:30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. స్నేహితురాలి పిర్యాదు తో డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది చెరువులో గాలింపు చర్యలు చేపట్టగా గురువారం రాత్రి వరకూ ఆమె ఆచూకీ లభించలేదు. అయితే.. ఈరోజు ఉదయం పాయల్ మృత దేహం లభ్యమైనట్లు తెలుస్తోంది.