ప‌వ‌న్ క‌డ‌ప ప‌ర్య‌ట‌న‌లో అప‌శ్రుతి..

కౌలు రైతు యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు కడప జిలాల్లో పర్యటిస్తున్నారు. ఈ తరుణంలో యాత్రలో అప‌శ్రుతి చోటుచేసుకుంది. హైద‌రాబాద్ నుంచి విమానంలో క‌డ‌ప ఎయిర్‌పోర్టు చేరుకున్న ప‌వ‌న్‌… అక్క‌డి నుంచి రోడ్డు మార్గం ద్వారా సిద్ధ‌వ‌టం బయలుదేరారు. మ‌రికాసేప‌ట్లోనే అక్కడికి చేరుకుంటార‌న‌గా.. ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌లో అప‌శ్రుతి చోటుచేసుకుంది. సిద్ధ‌వ‌టం మండ‌లం మ‌లినేనిప‌ట్నం వ‌ద్ద ప‌వ‌న్ కాన్వాయ్‌లోని వాహ‌నాలు ఒక‌దానితో మ‌రొక‌టి ఢీకొన్నాయి. ఈ ప్ర‌మాదంలో 10 మందికి గాయాలు కాగా… వారిని హుటాహుటీన క‌డ‌ప రిమ్స్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు పవన్ కళ్యాణ్ లక్ష రూపాయిల ఆర్ధిక సాయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు జిల్లాలో పర్యటించి రైతు కుటుంబాలకు తన వంతు సాయం చేసారు. ఈరోజు కడప జిల్లాలో కౌలు రైతుల భ‌రోసా యాత్ర‌ చేపట్టారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా జిల్లాలోని సిద్ధవ‌టం గ్రామంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ర‌చ్చ‌బండ పేరిట రైతుల‌తో ముఖాముఖి నిర్వహించారు. ర‌చ్చ‌బండ‌లోనే ఆయ‌న ప‌లువురు రైతుల కుటుంబాల‌కు రూ.1 ల‌క్ష చొప్పున స‌హాయం అందించ‌నున్నారు. జిల్లా ప‌రిధిలో ఆత్మహత్యలకు పాల్పడిన 176 మంది కౌలు రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున పవన్ కళ్యాణ్ ఆర్థిక సహాయం అందించనున్నారు.