బిగ్ బాస్ 6 ఫస్ట్ గ్లింప్ మాములుగా లేదు
నార్త్ లో సూపర్ సక్సెస్ అయినా బిగ్ బాస్..సౌత్ లోను అంతే సక్సెస్ అవుతూ వస్తుంది. తెలుగు లో అయితే ఈ షో కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. సీజన్ ..సీజన్ కు ప్రజలకు మరింత దగ్గరవుతుంది. ఇక ఇప్పుడు సీజన్ 6 తో అలరించేందుకు సిద్ధమైంది. దీనికి సంబదించిన ఫస్ట్ గ్లింప్ ను రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు. సెప్టెంబర్ 4 సాయంత్రం 6 గంటలకు..బిగ్ బాస్ సీజన్ 6 న మొదలుకాబోతుంది. ఇప్పటికే కంటెస్టెంట్లను క్వారంటైన్కి తరలించారు. ఈ సారి హౌస్లోకి మొత్తం 19 మంది వెళ్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా 15 మంది కంటెస్టెంట్లను ఇంట్లోకి పంపనున్నారట. ఆ తర్వాత మరో నలుగురిని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పంపించనున్నట్లు వినికిడి.
ఈసారి ఫేమస్ సెలబ్రెటీలు, బుల్లితెర నటీనటులు, సింగర్స్తోపాటు ఓ సామాన్యుడు కూడా వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. చలాకీ చంటి, యాంకర్ ఆరోహి, రీతూ చౌదరి, గలాట గీతూ, సింగర్ రేవంత్, అర్జున్ కళ్యాణ్, నువ్వు నాకు నచ్చావ్ సుదీప, నటుడు శ్రీహాన్, బుల్లితెర దంపతులు రోహిత్-మెరీనా అబ్రహం వంటి వారి పేర్లు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ షో కి సంబంధించి ఫస్ట్ గ్లింప్ విడుదల చేశారు . ఇది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోందని చెప్పవచ్చు.
అయితే ఈ సీజన్ కి కూడా ఎప్పటిలాగే నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు. రెట్టించిన ఉత్సాహంతో ప్రేక్షకులను సందడి చేయడానికి భారీ సెట్ అప్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.. లైఫ్ లో ఏ మూమెంట్ అయినా బిగ్ బాస్ తర్వాతే అంటూ ఫస్ట్ గ్లింప్ మొదలవుతుంది.ఈ డైలాగ్ నాగార్జున చెప్పడంతో ప్రారంభమైన ఈ వీడియో బిగ్ బాస్ హౌస్ సెట్ అప్ ను చూపించారు. అంతేకాదు లాంచ్ ఈవెంట్ కి సంబంధించిన కొన్ని విజువల్స్ ను అలాగే కొంతమంది కంటెస్టెంట్లను కూడా అస్పష్టంగా చూపించడం గమనార్హం.. అంతేకాదు ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా అని విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ చెప్పే డైలాగ్ కూడా ఈ ఫస్ట్ గ్లింప్ లో వినిపించింది.