నడిరోడ్డు ఫై ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లను చావబాదిన వైస్సార్సీపీ నేతలు

ఏపీలో అధికార పార్టీకి చెందిన నేతల ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. అధికార మదంతో రెచ్చిపోతున్నారు. తాము ఏంచేసినా ఏమికాదని , వెనుకాల మా పార్టీ ఉందని, సీఎం మావాడే అనే ధీమా తో ఇష్టంవచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. సామాన్య ప్రజలనే కాదు ప్రభుత్వ ఉద్యోగులను సైతం వదలడం లేదు. తాజాగా తమ కారుకు సైడ్ ఇవ్వలేదనే కోపం తో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లను నడి రోడ్ ఫై చావబాదిన ఘటన నెల్లూరు జిల్లా కావలిలో చోటుచేసుకుంది.

విజయవాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కావలి నుంచి విజయవాడ వెళ్తోంది. అయితే కావలిలోని ట్రంకు రోడ్డు లో ఆర్టీసీ బస్సు డ్రైవర్ రాంసింగ్ తన ముందున్న కారు అడ్డు తీయాలంటూ హారన్ మోగించాడు. దీంతో ఆ కారు డ్రైవ్‌ చేస్తున్న వ్యక్తి… బస్సు డ్రైవర్ తో వాదనకు దిగాడు. అనంతరం అక్కడే ఉన్న పోలీసులు వారికి సర్దిచెప్పి పంపించారు.

ఈ విషయాన్ని ఆ కారు డ్రైవ్‌ చేస్తున్న వ్యక్తి తన మిత్రులతో చెప్పి… 14 మంది ఆర్టీసీ బస్సును వెంబడించారు. ఆ తర్వాత.. ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లను దారుణంగా కొట్టారు. అయితే.. ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లను దారుణంగా కొట్టిన వారిలో కావలి వైసీపీ నేతలు శివరెడ్డి, విల్సన్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. తన కారుకు దారివ్వలేదని కోపం తో వారు ఈ దాడి చేసినట్లు తెలుస్తుంది. ఈ ఘటన కు సంబదించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇలాంటి వారైనా ప్రభుత్వం వెనకేసుకొచ్చేది అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.