వామ్మో మరో నాల్గు రోజుల్లో 800 కోట్లకు చేరనున్న ప్రపంచ జనాభా

ప్రపంచ జనాభా మరో నాల్గు రోజుల్లో 800 కోట్లకు చేరబోతున్నట్లు ఐక్యరాజ్యసమితి తెలిపి షాక్ ఇచ్చింది. మరో నాలుగు రోజుల్లో అంటే ఈ నెల 15 నాటికి 800 కోట్లకు జనాభా పెరగనుంది. ఇది 1950తో పోలిస్తే మూడు రెట్లు అధికమని తెలిపింది. 2030 నాటికి ఈ సంఖ్య సుమారు 850 కోట్లకు పెరుగుతుందని అంచనావేసింది. కాగా, మరో ఏడాదిలో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించనుందని పేర్కొన్నది. 2023లో చైనాను భారత్‌ అధిగమిస్తుందని వెల్లడించింది.

2020లో జనాభా పెరుగుదల ఒక శాతం కంటే తక్కువగా నమోదయిందని… 1950 తర్వాత ఇలా జరగడం ఇదే మొదటిసారని చెప్పింది. 2050 నాటికి ప్రపంచ జనాభా 970 కోట్లకు చేరుకుంటుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. 2080 నాటికి జనాభా వెయ్యి కోట్లను దాటుతుందని… 1,040 కోట్లకు చేసుకుంటుందని తెలిపింది. 2100 నాటికి 1,120 కోట్లను దాటుతుందని వెల్లడించింది. ప్రపంచ జనాభా వృద్ధిలో 50 శాతానికి పైగా కేవలం 8 దేశాల్లోనే సంభవిస్తోందని తెలిపింది. భారత్, నైజీరియా, ఇథియోపియా, ఈజిప్ట్, కాంగో, ఫిలిప్పీన్స్, పాకిస్థాన్, టాంజానియా దేశాల్లో అధిక జనాభా వృద్ధి రేటు ఉందని తెలిపింది.