వివేకా హ‌త్య కేసు..నిందితుల‌కు రిమాండ్ పొడిగింపు

కడప : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హత్య కేసులో పులివెందుల కోర్టు ముగ్గురు నిందితులకు మరోసారి రిమాండ్ పొడిగించింది. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, సునీల్ కుమార్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డిలకు ఫిబ్రవరి 22 వరకు రిమాండ్ పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈరోజు ముగ్గురు నిందితులను అధికారులు కడప సెంట్రల్ జైలు నుంచి ఆన్‌లైన్ ద్వారా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అయితే కోర్టు రిమాండ్ ను పొడిగించింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/