త్వరలోనే కోహ్లీ తానేంటో చూపిస్తాడు
కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్కుమార్ శర్మ ఆశాభావం
ముంబయి: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ త్వరలోనే పుంజుకుంటాడని అతని చిన్ననాటి కోచ్ రాజ్కుమార్ శర్మ ఆశాభావం వ్యక్తం చేశారు. న్యూజిలాండ్ పర్యటనలో పూర్తిగా విఫలమైన కోహ్లీ తదుపరి దక్షిణాఫ్రికా సిరీస్లో తానేంటో చూపిస్తాడన్నారు. త్వరలోనే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పుంజుకుంటాడని అతని చిన్ననాటి కోచ్ రాజ్కుమార్ శర్మ ఆశాభావం వ్యక్తం చేశారు. న్యూజిలాండ్ పర్యటనలో పూర్తిగా విఫలమైన కోహ్లీ తదుపరి దక్షిణాఫ్రికా సిరీస్లో తానేంటో చూపిస్తాడన్నారు. రెండు మ్యాచ్ల్లో విఫలమైనంత మాత్రాన విరాట్ కోహ్లీ స్వింగ్ బౌలింగ్ ఆడలేడనడం సరికాదు. ఇదో తాత్కాలిక సందర్భం మాత్రమే. త్వరలోనే కోహ్లీ పుంజుకుంటాడు’ అని రాజ్కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘నేను కోహ్లీతో తరచూ మాట్లాడుతుంటా. ముఖ్యంగా ఇలాంటి సందర్భాల్లో ఇంకా ఎక్కువ చర్చిస్తా. కోహ్లీ బాగా ఆడుతున్నా అనూహ్యంగా పెవిలియన్ చేరుతున్నాడు. ఈ క్రెడిట్ ముమ్మాటికీ కివీస్ బౌలర్లదే. వారిని మెచ్చుకోని తీరాల్సిందే. కివీస్ బౌలర్లు సరైన ప్రణాళికతో ఆడారు. కోహ్లీ ఒక్కడినే కాకుండా భారత బ్యాట్స్మెన్ అందర్నీ ఎలా ఎదుర్కోవాలో ముందుగానే సిద్ధమయ్యారు’ అని రాజ్కుమార్ పేర్కొన్నారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/