జైపూర్లో మరో కరోనావైరస్ కేసు
జైపూర్: కరోనా వైరస్ భారత్లోనూ కలవరం సృష్టిస్తుంది. తాజాగా జైపూర్లో మరో కరోనా వైరస్ నమోదయింది. ఇటలీ నుంచి జైపూర్కు వచ్చిన టూరిస్ట్కు సోమవారం కరోనా వైరస్ పాజిటివ్గా తేలిందని రాజస్థాన్ వైద్య,ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కాగా, ఇవాళ ఒక్కరోజే దేశంలో మూడు కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో దేశంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య ఆరుకు చేరింది. కేరళలో ఇప్పటికే 3 కేసులు నమోదు కాగా..తాజాగా హైదరాబాద్, ఢిల్లీ, జైపూర్లో ఒక్కొక్కరు చొప్పున కరోనావైరస్ బారినపడ్డారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/