వాలంటీర్ అంత మాట అంటున్నాడా..? వంగలపూడి అనిత ఏంటి అలా అనేసింది

ప్రస్తుతం ఏపీలో వాలంటీర్ల అంశం పెద్ద దుమారం రేపుతోంది. కొంతమంది వాలంటీర్లు చెడుగా ప్రవర్తిస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర ప్రజలంతా మాట్లాడుకునేలా చేసింది. దేశంలో ఎక్కడ లేని విధంగా జగన్ సర్కార్ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది. ప్రజల వద్దకే అన్ని అంటూ వాలంటీర్లు పెన్షన్లు , రేషన్లు , ప్రభుత్వ పథకాలు అందిస్తున్నారు. అయితే వీరిలో కొంతమంది అన్యాయాలకు పాల్పడుతున్నారని , ప్రభుత్వ పధకం మీకు అందాలంటే మాకు ఏంటి అని అడుగుతున్నారని పవన్ ఆరోపించారు. ఈ ఆరోపణల ఫై వైస్సార్సీపీ నేతలు వాలంటీర్లు నిరసనలు తెలుపుతున్నారు.

ఈ క్రమంలో టీడీపీ పార్టీ మహిళా విభాగానికి అధ్యక్షురాలి హోదాలో ఉన్న వంగలపూడి అనిత వాలంటీర్లపై స్పందించారు. వలంటీర్ల వ్యవస్థ విషయంలో తాను ఒకసారి పచ్చిపచ్చిగా మాట్లాడుతానని చెప్పిన అనిత బూతు పురాణం అందుకున్నారు. పెన్షన్ కావాలని ఎవరైనా అడిగితే నా దగ్గరికి వస్తావా అని డైరెక్ట్ గా అడిగే పరిస్థితి వచ్చిందన్నారు. ఆఖరికి నా ఇంటి స్థలం ఇస్తావా అని అంటే ‘నాకేంటి’ అని అడుగుతున్నారని అనిత అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారుతున్నాయి. దీనిపై ఇంకెంత రగడ ఉంటుందో చూడాలి.