మరోసారి చైనాపై అమెరికా ఆరోపణలు

వాక్సిన్ రీసెర్చ్ ని హ్యాక్ చేశారంటున్న అమెరికా

america-china
america-china

అమెరికా: కరోనా వైరస్‌ కారణంగా అమెరికా చైనాపై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో మరోసారి తాజాగా చైనాపై అమెరికా ఆరోపణలు గుప్పించింది. తాము చేస్తున్న వైరస్ రీసెర్చ్ ప్రక్రియను చైనా హ్యాక్ చేస్తోందని ఆరోపించింది. ఈ మేరకు సైబర్ నివేదికలు విడుదలయ్యాయి. ఎన్నో దేశాలు కరోనా వాక్సిన్ తయారీలో పోటీ పడుతుండగా, ఎంతో విలువైన రీసెర్చ్ ని దొంగిలించేందుకు చైనా హాకర్లు ప్రయత్నిస్తున్నారని, తమ అధ్యయనంలో వెల్లడైనట్టు ఎఫ్బీఐ, సైబర్ సెక్యూరిటీ ఎక్స్ పర్ట్స్ అభిప్రాయపడ్డారు. ఈ హాకర్లు చైనా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని, అతి త్వరలోనే ఈ వ్యవహారాన్ని ఆధారాలతో బయట పెడతామని, అధికారిక ప్రకటననూ వెలువరిస్తామని పేర్కొంది.

కాగా, అమెరికా తాజా ఆరోపణలను చైనా ఖండించింది. ఏ దేశంలోనైనా సైబర్ దాడులను తాము వ్యతిరేకిస్తామని, టీకా పరిశోధనలను, కరోనా చికిత్సా విధానం విషయంలోనూ ప్రపంచాన్ని చైనా నడిపిస్తోందని ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. ఆధారాలు లేకుండా ఈ తరహా ఆరోపణలు సృష్టించడం అనైతికమని మండిపడ్డారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/