యుఎస్, తాలిబన్ల శాంతి ఒప్పందం.. భారత్ పర్యవేక్షణ
న్యూఢిల్లీ: భారత్ సమక్షంలో తాలిబన్, అమెరికాల మధ్య శనివారం శాంతి ఒప్పందం జరుగనుంది. ఖతార్లోని దోహాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ ఒప్పందంతో.. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న వేలాది మంది అమెరికా సైనికులు ఉపసంహరించుకోనున్నారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్లో దశాబ్ధాలుగా ఉన్న హింసాత్మక వాతావరణానికి బ్రేక్ పడనుంది. అమెరికా, తాలిబన్ మధ్య జరుగుతున్న శాంతి ఒప్పందానికి ఆఫ్ఘన్ దూరంగా ఉంటుంది. ప్రస్తుతం ఆ దేశంలో రాజకీయ అనిశ్చితి నెలకొంది. తాలిబన్తో అమెరికా ఎలాంటి ఒప్పందానికి అంగీకరించిందో ఇంకా స్పష్టంగా తెలియదు. ఆ డీల్లో ఉన్న షరతుల గురించి ఎలాంటి పబ్లిక్ ప్రకటన జరగలేదు. దోహాలో జరిగే సంతకాల ఒప్పందానికి ఆఫ్ఘనిస్తాన్ హాజరుకావడం లేదు. సుమారు 30 దేశాల ప్రతినిధులు సంతకాల ఒప్పందానికి హాజరుకానున్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/