బాబు పర్యటన కు నేతలు దూరం..

రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని తన వయసును సైతం లెక్క చేయకుండా టిడిపి అధినేత చంద్రబాబు కష్టపడుతున్నారు. రోడ్ షో , పర్యటనలు చేస్తూ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. రీసెంట్ గా కర్నూల్ పర్యటన సక్సెస్ కావడం , ప్రజలు నీరాజనాలు అందించడంతో చంద్రబాబు లో జోష్ పెంచారు. ఈ క్రమంలో ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమం ప్రారంభించారు. చింతలపూడి, దెందులూరు నియోజకవర్గాల్లో బాబు పర్యటన కొనసాగబోతోంది. ఈ క్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కీలక నాయకులు తమకు ముఖ్యమైన పనులున్నాయిన, తమ ఇళ్లల్లో వచ్చే నెలలో శుభకార్యాలున్నాయని బాబు పర్యటన కు దూరంగా ఉన్నారట.

మూడురోజులపాటు జరిగే బాబు కార్యక్రమానికి వీరంతా డుమ్మా కొట్టబోతున్నారు. ఈ విషయాన్ని పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించారు. సారీ.. సార్ అన్నారు. ఎవరింట్లో పెళ్లికోసం తమ నేత ఈ కార్యక్రమ చేపడుతున్నారో ఈ నాయకులకే తెలియాలి. పార్టీని నమ్ముకొని ఎదిగి, సంపాదించి, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు సహకరించని నాయకులు ఇలా వ్యవహరించవచ్చా? అనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతోంది. ఎన్నికలకు ముందు జరుగుతున్న కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజాదరణతో విజయవంతమయ్యేలా చూడాల్సిన బాధ్యతల నుంచి సదరు నాయకులు కావాలనే తప్పుకుంటున్నట్లు అర్థమవుతోంది. దీంతో అనంతపురం జిల్లాకు చెందిన నేతలకు కబురు పంపించి గోదావరి జిల్లాలకు రప్పిస్తున్నట్లు సమాచారం.