వారంలో తెలంగాణ పోలీస్‌ నోటిఫికేషన్‌ విడుదల: మంత్రి హరీశ్‌ రావు

హైదరాబాద్: మంత్రి హరీశ్‌ రావు పటాన్‌చెరూలో సంగారెడ్డి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్‌ఐ, కానిస్టేబుల్ శిక్షణ తరగతులను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. సమయాన్ని వృధా చేయకుండా చదువుకొని అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పోలీస్ ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్ కల్పించిన ఏకైక ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ సర్కార్‌ మాత్రమేనని చెప్పారు. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా రిజర్వేషన్లు కల్పిస్తున్నామని తెలిపారు. వారం రోజుల్లో పోలీస్‌ ఉద్యోగల భార్తీకి నోటిఫికేషన్‌ వస్తున్నదని, సిద్ధంగా ఉండాలని ఉద్యోగార్థులకు హరీశ్‌ రావు పిలుపునిచ్చారు. ప్రభుత్వం భర్తి చేస్తున్న 80 వేలకుపైగా ఉద్యోగాల్లో 20 వేల ఖాళీలు పోలీస్‌ శాఖలోనే ఉన్నాయని చెప్పారు.

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేస్తున్నామని, కేంద్రంలో 15 లక్షలకుపైగా ఉద్యోగాలను ఎప్పుడు భర్తీ చేస్తారో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి చెప్పాలని డిమాండ్‌ చేశారు. ధరలు పెంచినందుకు, ఉద్యోగాలు ఇవ్వనందుకు, ప్రజల జీవితాలను ఆగం చేస్తున్నందుకు యాత్ర చేస్తున్నారా అని ప్రశ్నించారు. కుల, మతాల మధ్య చిచ్చు పెట్టి బీజేపీ లబ్ది పొందాలని చూస్తున్నదని విమర్శించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/