అవినాష్‌రెడ్డికి షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ మంజూరు

  • సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం

ts-high-court-grants-anticipatory-bail-to-ys-avinash-reddy

హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది.

కాగా, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న అవినాశ్ ను ఈరోజు వరకు అరెస్ట్ చేయవద్దని సీబీఐకి గత శనివారం వాదనల సందర్భంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బెయిల్ మంజూరు చేయంలో అవినాశ్ కు బిగ్ రిలీఫ్ లభించినట్టయింది. మరోవైపు, హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో వివేకా కుమార్తె సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.