ఆర్టీసీ బిల్లును పరిశీలించేందుకు మరికొంత సమయం కావాలి : గవర్నర్

బిల్లు నిన్ననే తన వద్దకు వచ్చిందని వెల్లడి

governor-tamilisai-soundararajan

హైదరాబాద్‌ః ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఇటీవల తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ తమిళిసై‌ ఆమోదం కోసం పంపించింది. ఈ బిల్లుకు ఇప్పటి వరకు ఆమోదం తెలపలేదు. ఈ అంశంపై గవర్నర్ తమిళిసై స్పందించారు. ఆర్టీసీ బిల్లు నిన్ననే తన వద్దకు వచ్చిందని చెప్పారు. బిల్లును పరిశీలించి న్యాయ సలహాలు తీసుకుంటానని, అందుకు కొంత సమయం కావాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ బిల్లును ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశ పెట్టాలని భావించింది. ఆర్థికపరమైన బిల్లు కావడంతో గవర్నర్‌కు పంపించింది.