ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురు యువకుల దుర్మరణం..!

న్యూఢిల్లీః హర్యానా భివానీలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సెర్లా శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు యువకులు దుర్మరణం చెందారు. యువకులు ప్రయాణిస్తున్న కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. సంఘటనా స్థలంలో నలుగురు యువకులు మరణించగా.. ఆసుపత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జ అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే, ప్రమాదంలో లారీ వెనుక తాడును సరి చేస్తున్న క్లీనర్‌ సైతం మృతి చెందాడు. లారీ క్లీనర్‌ను యూపీకి చెందినవాడు కాగా.. మృతులను బుధేరాకు చెందిన వారిగా గుర్తించారు. యువకులు ఓబ్రా నుంచి బహల్‌ వైపు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి అతివేగమే కారణంగా తెలుస్తున్నది.