రేపు సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌ లో ట్రాఫిక్ ఆంక్షలు

రేపు ప్రధాని మోడీ సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌ లో పర్యటించునున్న నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. తిరుపతి – సికింద్రాబాద్ వందేభారత్ ను మోడీ ప్రారంభిస్తారు. అనంతరం సికింద్రాబాద్ స్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం పరేడ్ గ్రౌండ్స్‌‌‌‌‌‌‌‌లో జరుగనున్న బహిరంగ సభ లో పాల్గొననున్నారు. ఈ తరుణంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బేగంపేట ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోర్టు నుంచి పరేడ్‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్స్‌‌‌‌‌‌‌‌, సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌ రైల్వే స్టేషన్‌‌‌‌‌‌‌‌ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం1.30 గంటల వరకు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని సిటీ సీపీ ఆనంద్ తెలిపారు. ప్రధాని సభకు జిల్లాల నుంచి వచ్చే కార్యకర్తల వెహికల్స్​కు దోబీఘాట్‌‌‌‌‌‌‌‌, బైసన్ పోల్‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్స్‌‌‌‌‌‌‌‌, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌, కంటోన్మెంట్‌‌‌‌‌‌‌‌ పార్క్‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌, నెక్లెస్‌‌‌‌‌‌‌‌ రోడ్​లో ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. వాహనదారులు పోలీసులకు సహకరించాలని సూచించారు.