రేపు సికింద్రాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
రేపు ప్రధాని మోడీ సికింద్రాబాద్ లో పర్యటించునున్న నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. తిరుపతి – సికింద్రాబాద్ వందేభారత్ ను మోడీ ప్రారంభిస్తారు. అనంతరం సికింద్రాబాద్ స్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం పరేడ్ గ్రౌండ్స్లో జరుగనున్న బహిరంగ సభ లో పాల్గొననున్నారు. ఈ తరుణంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం1.30 గంటల వరకు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని సిటీ సీపీ ఆనంద్ తెలిపారు. ప్రధాని సభకు జిల్లాల నుంచి వచ్చే కార్యకర్తల వెహికల్స్కు దోబీఘాట్, బైసన్ పోల్ గ్రౌండ్స్, ఆర్ఆర్సీ గ్రౌండ్, కంటోన్మెంట్ పార్క్ గ్రౌండ్, నెక్లెస్ రోడ్లో ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. వాహనదారులు పోలీసులకు సహకరించాలని సూచించారు.